EPAPER

Congress: జగన్ కు మరో షాక్.. కాంగ్రెస్ పార్టీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే

Congress: జగన్ కు మరో షాక్.. కాంగ్రెస్ పార్టీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే

ysr mla join CongressCongress (Latest Political news in Andhra Pradesh): రాష్ట్ర అధికార పార్టీ వైసీపీకి అసెంబ్లీ ఎన్నికల ముందు వరుస షాక్ లు తగులుతున్నాయి. గత కొన్ని రోజులుగా పార్టీలో సీటు రాని కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని గుడ్ బై చెబుతున్నారు. తాజాగా మరో ఎమ్మెల్యే వైసీపీకి రాజీనామా చేశారు. వైసీపీకి రాజీనామా చేసిన ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.


వైసీపీకి పూతలపట్టు నియోజకవర్గంలో కోలుకోలేని దెబ్బ తగిలింది. పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు వైసీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కడపలో జరిగిన కార్యక్రమంలో ఎంఎస్ బాబుకు పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు.

పేదోడి సంక్షేమం కాంగ్రెస్ తోనే సాధ్యమని నమ్మి వచ్చిన ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగిందని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తెలిపారు.


ఇటీవలే వైసీపీ అధిష్ఠానం పార్టీలో ఎంపీ, ఎమ్మెల్యేలకు టికెట్ నిరాకరించింది. దీంతో వారంతా వరుసగా పార్టీని వీడుతున్నారు. వీరు ఇలా పార్టీని వీడడంతో వైసీపీకి అసెంబ్లీ ఎన్నికల్లో కోలుకోలేని దెబ్బ తగిలే అవకాశం ఇంది.

Related News

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Big Stories

×