Prakasam Crime: ఆడపిల్లలు, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన క్రూరులను న్యాయస్థానాలు ఎంత కఠినంగా శిక్షించినా.. మిగతా వారిలో ఏ కోశాన కించిత్ మార్పు రావడం లేదు. చిన్నపిల్ల నుంచి పండు ముసలి వరకూ.. ఆడతనం ఉంటే చాలు అనుకుంటూ.. ఇష్టారీతిన అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.
మద్యంమత్తులో కళ్లుమూసుకుపోయిన ఒక కామాంధుడు.. వృద్ధురాలిపై దారుణానికి ఒడిగట్టాడు. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన ప్రకాశం జిల్లా మార్కాపురంలో చోటుచేసుకుంది. కమలనాథ్ అనే యువకుడు ఫుల్లుగా మద్యం సేవించి.. ఒంటరిగా నివాసం ఉంటున్న వృద్ధురాలి ఇంట్లోకి చొరబడ్డాడు. కంగుతిన్న ఆమె.. బిగ్గరగా కేకలు వేయగా.. ఆమె నోరు నొక్కి.. అత్యాచారం చేసి పరారయ్యాడు.
ఈ అఘాయిత్యం గురించి వృద్ధురాలు తన కుటుంబ సభ్యులకు చెప్పగా.. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలు అస్వస్థతకు గురవ్వడంతో.. ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, చికిత్స చేయిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడు కమలనాథ్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.