Prakasam crime : ప్రకాశం జిల్లా ఒంగోలులోని సీతారామపురంలో హత్య కలకలం రేపింది. అశ్విని అనే యువతి భర్త దర్శి మల్లికార్జున రావుని హత్య చేసింది. కుటుంబ సమస్యలు తో తన భర్తను హత్య చేసినట్లు సమాచారం. అశ్విని సంతనూతలపాడులో వాలంటీర్ గా పనిచేస్తుంది. మల్లికార్జున రావు పెయింట్ పని చేస్తుంటాడు.
కొంతకాలంగా ఒంగోలులోని సీతారామపురంలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఇద్దరి మధ్య ఘర్షణతో అశ్విని తన భర్తను హత్య చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని నిందుతురాలిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.