Pawan Kalyan : పూనమ్కౌర్ ఏపీ పాలిటిక్స్పై ట్వీట్ చేసి మరోసారి వార్తల్లోకెక్కారు. ఆంధ్రప్రదేశ్లో ఈమధ్య కొందరు ఫేక్ లీడర్లు మహిళల మీద ఎక్కడా లేని అభిమానాన్ని చూపుతూ రోడ్లపైకి వస్తున్నారు. అలాంటివాళ్లను నమ్మొద్దు. మహిళలకు ఏదో జరిగిపోతుందని వారికి అంతగా అందోళన ఉంటే ఢిల్లీలో రెజ్లర్లు చాలా రోజుల పాటు నిరసన దీక్ష చేశారు. కనీసం వారికి అనుకూలంగా ఒక్కమాటైనా వీరు మాట్లడలేకపోయారే అని ప్రశ్నించారు.
పూనమ్ చేసిన ట్వీట్ పవన్ కల్యాణ్ టార్గెట్గానే అంటున్నారు. వారిద్దరి వ్యవహారం వివాదంగా మారిన విషయం తెలిసిందే. పవన్ రాజకీయాల్లోకి వచ్చాక.. పూనమ్ పేరు పదే పదే వార్తల్లోకి వస్తోంది. సోషల్ మీడియాలో పీకే ఫ్యాన్స్తో ఓ రేంజ్లో వార్ నడుస్తోంది. పవన్ అభిమానులు రెచ్చగొట్టినప్పుడల్లా.. మరింత రెచ్చిపోతున్నారు పూనమ్కౌర్. ఇక వారాహి విజయయాత్రలో.. ఏపీలో మహిళలకు భద్రత లేదంటూ జనసేనాని.. తరుచూ విమర్శలు చేస్తుండటంతో.. ఆయనకు కౌంటర్గానే పూనమ్కౌర్ ఈ ట్వీట్ చేశారని చెబుతున్నారు. అయితే, ట్వీట్లో ఎక్కడా పవన్ పేరు ప్రస్తావించలేదామె.