Palnadu: పల్నాడు రాజకీయాల్లో సవాళ్ల పర్వం కొనసాగుతోంది. వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ రావు మధ్య మాటల యుద్ధం కంటిన్యూ అవుతోంది. తాజాగా యరపతినేని చేసిన కామెంట్స్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మహేష్ రెడ్డి. జగన్ ఆదేశాలతో ఒక్కడినే కట్టుబట్టలతో గురజాలకు వచ్చి.. ఓడించిన విషయాన్ని మరిచావా అంటూ ఎద్దేవా చేశారు. సొంత నియోజకవర్గంలో గెలిచే దమ్ములేని యరపతినేని.. 151 సీట్లు గెలిపించుకున్న జగన్తో పోటీ పడతావా అని మండిపడ్డారు. ఇలాగే వాగితే గత ఎన్నికలో 28 వేల ఓట్లతో ఓడించిన ప్రజలు.. ఈసారి 48వేలతో ఇంటికి పంపిస్తారని కాసు హెచ్చరించారు.
కాసు మహేశ్ రెడ్డి వ్యాఖ్యలకు మాజీ ఎమ్మెల్యే ,టీడీపీ నేత యరపతినేని సైతం అదే స్థాయిలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తాను మారిపోయిన మనిషినని.. అదే పాత శ్రీనుని అయితే ప్రత్యర్థులు బతికుండేవారు కాదంటూ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. అభివృద్ధి జరిగింది టీడీపీ పాలనలోనేనని యరపతినేని చెప్పుకొచ్చారు. అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? అంటూ సవాల్ చేశారు.