Attack on Janasena MLA car(Political news in AP): ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. రాత్రి జనసేన ఎమ్మెల్యే కారుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటనలో కారు అద్దాలు డ్యామేజ్ అయ్యాయి. ఘటన సమయంలో కారులో ఎమ్మెల్యే లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అసలేం జరిగింది? జనసేన ఎమ్మెల్యే బాలరాజుకు ఎవరైనా ప్రత్యర్థులున్నారా? ఇలా రకరకాల ప్రశ్నలు జనసేన కార్యకర్తలను వెంటాడుతున్నాయి.
సోమవారం రాత్రి పోలవరం జనసేన ఎమ్మెల్యే బాలరాజు కారుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటనలో కారు డ్యామేజ్ అయ్యింది. జీలుగుమిల్లి మండలం బర్రింకలపాడు కూడలి వద్ద ఈ ఘటన జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు కర్రలు, రాళ్లతో దాడి చేశారని అంటున్నారు. ఆ సమయంలో ఎమ్మెల్యే కారులో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
దాడి చేసింది ఎవరు? ఎందుకు దాడి చేశారు? అన్నదానిపై ఆరా తీసే పనిలోపడింది జనసేన పార్టీ. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే జనసేన అధినేత, డిప్యూటీ పవన్ కల్యాణ్ ఎమ్మెల్యే బాలరాజుకు ఫోన్ చేసి దాడికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. తనకు ఎలాంటి ప్రమాదం జరగలేదని, కారు వెనుక ఎవరో దాడి చేసినట్టు చెప్పుకొచ్చారు. ఆ సమయంలో కారులో ముగ్గురు వ్యక్తులున్నారు.
ALSO READ: జర్నలిస్టులకు తీపి కబురు చెప్పిన చంద్రబాబు..
దీనిపై సమగ్ర విచారణ చేస్తున్నామని పోలీసులు చెప్పారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. వీలైనంత త్వరగా నిందితులను పట్టుకుంటామని అధికారులు చెప్పుకొచ్చారు.