100 Crore Cheque : సింహాచలం నరసింహ స్వామికి ఓ భక్తుడు ఇచ్చిన కానుకను చూసి కంగుతిన్నారు ఆలయ అధికారులు. సింహాద్రి అప్పన్న హుండీలో ఏకంగా 100 కోట్ల రూపాయల చెక్ వేశాడు ఓ భక్తుడు. ఆలయ చరిత్రలో ఈ స్థాయిలో హుండీలో చెక్ రావడం తొలిసారి కావడంతో ఆలయ అధికారులు ఆ చెక్ను తీసి పరిశీలించారు.
100 కోట్ల చెక్ చూసి మొదట షాక్ అయిన హుండీ లెక్కింపు సిబ్బంది.. భారీ విరాళం చెక్ చెల్లుతుందా? లేదా? అనే అనుమానం వ్యక్తం చేశారు. ఆ తర్వాత వెరిఫికేషన్ కోసం ఆలయ ఈవోకు చూపించారు. ఆ చెక్ను బ్యాంకుకు పంపించి ఆరా తీశారు ఈవో.
అది నకిలీ చెక్ అని బ్యాంక్ అధికారులు తేల్చారు. భక్తుడి అకౌంట్లో కేవలం 17 రూపాయలు మాత్రమే ఉన్నాయని తెలిసి షాక్ అయ్యారు.
సింహాద్రి అప్పన్నకు వంద కోట్లు చెక్ వచ్చిన మాట వాస్తవమేనని.. అయితే అది ఫేక్ చెక్ అని తేలిందని క్లారిటీ ఇచ్చారు ఆలయ అధికారులు.