pawankalyan: టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్ ఓ వైపు సినిమాలు చేస్తూ.. మరోవైపు రాజకీయాలలో బిజీ బిజీగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తుండటంతో పవన్ తన సినిమాల షూటింగ్స్కి బ్రేక్ ఇచ్చి పూర్తిగా తన టైంని పార్టీ కోసమే కేటాయిస్తున్నారు. ఇకపోతే పవన్ రాజకీయాలు మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా ఎన్నో సహాయ కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు.
ఇదిలా ఉండగా.. పవన్ కళ్యాణ్కి తాజాగా ఒక ఉన్నత గౌరవం దక్కింది. తమిళనాడు వేల్స్ యూనివర్సిటీ వారు జనసేనానికి డాక్టరేట్ ప్రధానం చేసేందుకు సెలక్ట్ చేశారు. ఈ నెలలో జరగబోయే తమ యూనివర్సిటీ 14వ కన్వకేషన్ ఈవెంట్కి హాజరై డాక్టరేట్ అందుకోవాల్సిందిగా పవన్ కళ్యాణ్ను ఆహ్వానించారు. కానీ, పవన్ మాత్రం ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. వివిధ రంగాలలో రాణించిన గొప్ప గొప్ప వ్యక్తులు చాలామంది ఉన్నారని.. వారికి డాక్టరేట్ ఇవ్వాలని పవన్ కోరారు. ఈ మేరకు తనకు ఇస్తున్న డాక్టరేట్ని తిరస్కరిస్తూ వేల్స్ యూనివర్సిటీకి పవన్ లేఖ రాశారు.
తనని వేల్స్ యూనివర్సిటీ డాక్టరేట్కి సెలక్ట్ చేయడం సంతోషంగా, గౌరవంగా ఉందని అన్నారు. కానీ తనకంటే చాలా మంది గొప్పవారు ఉన్నారని.. వారిలో సరినవారికి ఈ డాక్టరేట్ ఇవ్వాల్సిందిగా పవన్ కోరారు. దీంతోపాటు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్ కారణంగా యూనివర్సిటీ 14వ కన్వకేషన్ కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు.