Pawan Kalyan Elected as JLP Leader: ఎట్టకేలకు జనసేన శాసనసభాపక్ష నేతగా పవన్ కల్యాణ్ను ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మంగళవారం ఉదయం మంగళగిరిలో జరిగిన పార్టీ సమావేశానికి 21 మంది జనసేన ఎమ్మెల్యేలు హాజరయ్యారు. పవన్ పేరును తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ ప్రతిపాదించారు. దాన్ని మిగతా ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.
ఇదిలావుండగా చంద్రబాబు కేబినెట్లో జనసేన, బీజేపీ నుంచి ఎవరెవరు మంత్రులుగా ఉండబోతున్నార నే దానిపై చర్చ జరుగుతోంది. ఈ విషయమై ఢిల్లీలో టీడీపీ అధినేత చంద్రబాబు- పవన్కల్యాణ్ మధ్య సమావేశం జరిగింది. ఐదు కేబినెట్ బెర్తులు కావాలని పవన్ కోరినట్టు, అందుకు బాబు ససేమిరా అన్నట్లు తెలుస్తోంది.
ఏపీలో జరుగుతున్న పరిణామాలు చూసి కూడా ఈ విధంగా అడగడం కరెక్టు కాదని బాబు అన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈసారి తమ పార్టీ నుంచి చాలామంది సీనియర్లు రేసులో ఉన్నారని తనపై చాలా ఒత్తిడి ఉన్నట్లు వివరించారట. మూడు లేదా నాలుగు అయితే చూద్దామని బాబు అన్నట్లు టీడీపీ వర్గాల నుంచి ఓ ఫీలర్ బయటకు వచ్చింది.
Also Read: నాకొద్దు ఆ పదవులు.. పవన్ నిర్ణయంతో షాక్ లో జనసేన
పవన్ కల్యాణ్కు డిప్యూటీ సీఎంతోపాటు మూడు కేబినెట్ బెర్తులు ఇవ్వాలని భావిస్తున్నట్లు అందులోని సారాంశం. తెనాలి నుంచి నాదెండ్ల, అనకాపల్లి నుంచి కొణతాల, నెల్లిమర్ల నుంచి లోకం మాధవి పేరు దాదాపు ఖారరైనట్లు తెలుస్తోంది. మండలి బుద్ద ప్రసాద్కు కేబినెట్లో చోటు లేకుంటే డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వడానికి దాదాపు ఓకే అయినట్టు అంతర్గత సమాచారం.
బీజేపీ నుంచి ఇద్దర్ని మంత్రులుగా తీసుకోనున్నారట. సుజనాచౌదరి కాగా, మరొకరు సత్యకుమార్. కామినేని పేరు పరిశీలనలో ఉందన్నది బీజేపీ వర్గాల మాట. పార్టీ సమావేశంలో నేతల నిర్ణయం మేరకు ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయేమో చూడాలి.
జనసేన శాసనసభా పక్ష నేత పవన్ కల్యాణ్.. వినేందుకు, మాట్లాడేందుకు చాలా కొత్తగా ఉందన్న జనసేనాని.. ఈ విజయానికి వారే ప్రధాన కారణం.. జనసైనికులు, వీరమహిళలకు ధన్యవాదాలు తెలిపిన పవన్#andhrapradeshelections #janasena100percentstrikerate @JSPVeeraMahila pic.twitter.com/9dj4bXJikF
— ChotaNews (@ChotaNewsTelugu) June 11, 2024