EPAPER
Kirrak Couples Episode 1

Pawan Kalyan : భీమవరంలో వారాహి యాత్ర .. పవన్ స్పీచ్ పై సర్వత్రా ఆసక్తి..

Pawan Kalyan : భీమవరంలో వారాహి యాత్ర .. పవన్ స్పీచ్ పై సర్వత్రా ఆసక్తి..

Pawan Kalyan : ఉభయగోదావరి జిల్లాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర ముగింపు దశకు చేరుకుంది. నేడు భీమవరంలో జనసేనాని వారాహి యాత్ర చేపట్టనున్నారు. ఇక్కడ నిర్వహించే సభలో పవన్ ప్రసంగించనున్నారు. అయితే ఈ సభలో జనసేనాని స్పీచ్ పై సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


ఇటీవల జనసేనానికి సీఎం జగన్ కౌంటర్ ఇచ్చారు. పవన్ మాట్లాడే విధానాన్ని తప్పుపట్టారు. లారీ లాంటి వాహనం ఎక్కి బూతులు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆ తర్వాత జగన్ కు పవన్ కూడా తిరిగి కౌంటర్ ఇచ్చారు. సీఎంకు వారాహి, వరాహి మధ్య తేడా తెలియదని సెటైర్లు వేశారు. అంతేకాదు ఇకపై తాను జగన్ శైలిలో మాట్లాడతానని చురకలు అంటించారు. ఈ నేపథ్యంలో భీమవరం సభలో పవన్ స్పీచ్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

గురువారం భీమవరంలో శెట్టిబలిజ నేతలతో పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. బీసీలకు రాజ్యాధికారం రావాలని ఆకాంక్షించారు. శెట్టిబలిజలను గౌడ కులస్తులుగా గుర్తించాలన్నారు. ఇతరులతో పోల్చితే బీసీలలో ఐక్యత తక్కువగా ఉందని అభిప్రాయపడ్డారు. బీసీలు బలపడితేనే రాజ్యాధికారం వస్తుందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.


Related News

Ongole: ఒంగోలులో ఉద్రిక్తత.. జనసేన ఫ్లెక్సీని తొలగించిన టీడీపీ శ్రేణులు

Pawan Kalyan: ఏడుకొండలవాడా, క్షమించు.. పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం, ఇక 11 రోజులపాటూ..

Nandamuri Mohan Roopa: వరదల బాధితుల కోసం నందమూరి మోహన్ రూప భారీ విరాళం

Tirupati Ladddu Row: లడ్డూ కల్తీపై జగన్ ఎంక్వైరీ కోరడమేంటి? అప్పుడు అధికారంలో ఉన్నది ఆయనే కదా? : షర్మిల

Janasena Joinings: ఇట్స్ అఫీషియల్.. ఆ ఇద్దరి చేరికను కన్ఫర్మ్ చేసిన జనసేన

MP Vijayasai Reddy: విజయ సాయిరెడ్డి అక్రమ నిర్మాణాల కూల్చివేత.. చంద్రబాబుపై మండిపాటు

Tirumala Laddu Row: తిరుమల లడ్డూ వివాదం, విచారణ ఆపాలంటూ సుబ్బారెడ్డి పిటిషన్, సాయంత్రానికి రిపోర్ట్

Big Stories

×