Pawan Kalyan latest speech(AP political news): మన కులం అని చూడొద్దని.. మనవాడు మంచోడా? కాదా? అనేదే చూడాలని ప్రజలకు పిలుపు ఇచ్చారు పవన్ కల్యాణ్. తాను బీజేపీతో కలిసి ఉన్నాననే కారణంతో.. ముస్లిం వర్గాలు జగన్ వెంట ఉంటామంటున్నారని.. తాను ఏ పార్టీతో ఉన్నానని కాకుండా.. తాను మీకోసం ఏదైనా చేస్తాననే నమ్మకం ఉంటే తనకే ఓటు వేయాలని కోరారు. దళితులు సైతం జగన్ తమవాడేనని అంటారని.. మరి, మీవాడు మీకోసం ఏం చేశాడని ప్రశ్నించారు పవన్. ఈ సందర్భంగా తన సినిమాలకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు చెప్పారు పవర్ స్టార్.
తనకు ముస్లిం, దళిత, క్రిస్టియన్ వర్గాలంటే ఇష్టమని.. అందుకే ‘జానీ’ సినిమాకు ఓ దళిత, క్రిస్టియన్ యువకుడి పేరు పెట్టానని అన్నారు. అందులో నారాజు కాకురో మా అన్నయ్యో.. నజీరు అన్నయ్యో.. అనే పాట కూడా రాసానని గుర్తు చేసుకున్నారు పవన్. ఓ గిరిజనుడిని హీరోగా చూపిస్తూ.. తన సినిమాకు ‘భీమ్లా నాయక్’ అనే టైటిల్ పెట్టామని చెప్పారు. తాను సినిమాల్లోనూ సోషల్ ఇంజినీరింగ్ చేశానని.. రాజకీయాల్లోనూ అన్ని వర్గాల కోసం పని చేస్తానని అన్నారు జనసేనాని.