Pawan Kalyan Speech latest(AP politics): హిందూధర్మం అంటే తమాషాగా ఉందా.. హిందూధర్మం జోలికి వస్తే ఖబడ్దార్.. అంటూ సీఎం జగన్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు పవన్ కల్యాణ్. దేవాలయాలపై దాడులు జరుగుతున్నా పట్టించుకోవట్లేదని.. అన్నవరం ఆలయంలో పురోహితులను వేలం వేయడం ఏంటని మండిపడ్డారు. సీఎం జగన్ దేవాలయాలనే ఎందుకు టార్గెట్ చేశారని ప్రశ్నించారు. జగన్ హయాంలో 219 ఆలయాలపై దుర్ఘటనలు జరిగాయని.. విగ్రహాల ధ్వంసం కేసులో దోషులను ఇప్పటి వరకు పట్టుకోలేదన్నారు పవన్.
దేవాలయాల్లోని పురోహితులను వేలం వేయడం రాజ్యాంగ విరుద్దమన్నారు జనసేనాని. ఇదే పనిని ఇస్లాం, క్రిస్టియన్ మతాల్లో చేయగలరా? అని నిలదీశారు. మత విషయాల్లో ప్రభుత్వ ప్రమేయం తగదన్నారు. పురోహితుల వేలంపై జనసేన తరఫున కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు పవన్ కల్యాణ్.
ధరల పెరుగుదల, మద్యం ధరల పెంపు, చెత్త పన్ను, ఇసుక మైనింగ్, సీపీఎస్ రద్దు, ఉద్యోగుల పీఎఫ్ పక్కదారి పట్టించడం.. ఇలా జగన్ డిజిటల్ దొంగలా మారారని.. జగన్ జగ్గూ భాయ్ అయ్యారని మండిపడ్డారు పవన్.
కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లను జగన్ మార్చేశారని.. నవరత్నాలు అందులోనుంచే పుట్టుకొచ్చాయని.. ఈ పథకాలు జగన్కు ముందు కూడా ఉన్నాయని వివరించారు జనసేనాని.