Pawan Kalyan: తనను చంపేందుకు కుట్ర చేశారంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాకినాడలో జరిగిన తూర్పు గోదావరి జిల్లా జనసేన నాయకుల సమావేశంలో ఆయన ఈ కామెంట్స్ చేశారు. తనకు ప్రాణహాని ఉందన్నారు. తనను హతమార్చేందుకు ప్రత్యేకంగా సుపారీ గ్యాంగ్లను దింపారనే సమాచారం తనకు ఉందన్నారు పవన్. జనసేన నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు కచ్చితంగా భద్రతా నియమాలు పాటించాలని సూచించారు.
ఏపీలో జనసేన బలంగా ఉందన్నారు పవన్ కళ్యాణ్. అధికారంలోని వైసీపీని గద్దె దించే విధంగా ముందుకెళ్తున్నట్టు చెప్పారు. ఇదే తన ప్రాణాలకు ముప్పుగా మారిందని పవన్ అభిప్రాయం. అధికారం పోతుందనే భావన.. ఎదుటివారిని క్రూరంగా మార్చేస్తుంది.. ఎంతకైనా తెగించేలా చేస్తుందంటూ సంచలన ఆరోపణలు చేశారు పవన్ కళ్యాణ్.
జనసేనాని వ్యాఖ్యలు ఇప్పుటు ఏపీలో కలకలం రేపుతున్నాయి. అసలే, వైసీపీవి హత్యా రాజకీయాలంటూ విపక్షాల నుంచి తీవ్ర విమర్హలు వస్తున్నాయి. వివేకా హత్య ప్రకంపణలు రేపుతోంది. అధికారపార్టీ ఆగడాలకు అనేకమంది జనసేన, టీడీపీ కార్యకర్తలు హత్యకు గురయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏకంగా జనసేనానినే చంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని.. తన హత్య కోసం సుపారీ ఇచ్చారని.. పవన్ కల్యాణే స్వయంగా చెప్పడంతో జనసైనికులు, ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడుతున్నారు.