EPAPER

AP Elections : టీడీపీ ఎన్నికల హామీ.. ముందే అమలుకు జగన్ సర్కార్ యోచన..

AP Elections : టీడీపీ ఎన్నికల హామీ.. ముందే అమలుకు జగన్ సర్కార్ యోచన..

AP Elections : ఏపీలో ఎన్నికల హడావిడి మొదలయ్యంది. అధికారం కోసం అన్ని పార్టీల అధినేతలు ప్రజలకు హామీల వర్షం కురిపిస్తున్నారు. తెలంగాణ, కర్ణాటకలో మహిళలకు రాష్ట్రమంతటా ఉచిత ప్రయాణం కల్పించి కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే.


టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే.. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామంటూ హామీ ఇచ్చారు. డిసెంబార్ 20 న విజయనగరంలో జరిగిన ‘యువగళం-నవశకం’ సభలో చంద్రబాబు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆంశంపై హామీ ఇచ్చారు.

దాంతో జగన్ ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. ఈ హామీని ముందగానే అమలు చేసే యోచనలో ఉన్నట్టు సమాచారం. అందుకోసం సీఎం జగన్ అధికారులతో.. ఉచిత ప్రయాణం అమలు చేస్తే ఆర్టీసీ రాబడి ఎంత తగ్గుతుంది? ప్రభుత్వం ఎంత చెల్లించాల్సి వస్తుంది.. పొరుగు రాష్ట్రాలు ఏ నిబంధనలతో అమలు చేశాయి.. అన్న అంశాలపై అధికారులతో చర్చిస్తున్నారు.


సంక్రాంతి పండుగ నుంచే ఈ పథకాన్ని అమలులోకి తీసుకొచ్చేందుకు జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలుస్తుంది. పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌, విశాఖపట్నం, విజయవాడలోని సిటీ సర్వీసుల్లో ఉచిత ప్రయాణం అమలు చేయాలని అనుకుంటున్నట్టు సమాచారం.

ఏపీలో ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో నిత్యం 40 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. అందులో 15 లక్షల మంది మహిళలు ప్రయణం చేస్తున్నారు.10 లక్షల వరకు బస్ పాస్ లు కలిగినవారు ఉన్నారు. 3 నుంచి 4 లక్షల వరకు విద్యార్థినులు ప్రయాణిస్తున్నారు. ఏపీఎస్ఆర్టీసీకి రోజుకు సగటున రూ. 17 కోట్ల ఆదాయం వస్తోంది.

Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×