Padma Bhushan Award To Nandamuri Balakrishna: టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ సినిమాల్లో తనకంటూ ఓ హిస్టరీ క్రియేట్ చేసుకున్నారు. సినిమాలతో పాటు రాజకీయాల్లోనే చక్రం తిప్పుతున్నారు. దీంతోపాటు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ స్థాపించి ఎంతోమంది నిరుపేదలకు దేవుడై ఉచితంగా చికిత్స అందిస్తున్నారు. అయితే బాలయ్య అభిమానులకు త్వరలోనే మంచి శుభవార్త అందనుంది.
ప్రతి ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరఫున రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మా పుష్కరాలు అందజేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈసారి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు ఈ పురస్కారాలు అందనున్నాయి. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డు దక్కింది.
Also Read: ఏ ముహూర్తాన చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారో, ఆడపిల్లల పరిస్థితి దారుణం, ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు
అయితే ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున పద్మభూషణ్ అవార్డుకు గాను సినీ పరిశ్రమ నుంచి నందమూరి బాలకృష్ణ పేరుని ఎంపిక చేసి కేంద్రానికి పంపిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే మరో సీనియర్ నరుడు మురళీమోహన్ పేరుని కూడా సిఫార్సు చేయనున్నట్లు సమాచారం. కాగా, ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం కూడా త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.