Nellore Rural: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై ముఖ్యమంత్రి జగన్ అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో నెల్లూరు రూరల్ వైసీపీ అధ్యక్షుడిగా ఆదాల ప్రభాకర్ రెడ్డిని నియమించారు. ఈక్రమంలో పడారుపల్లి కార్పొరేటర్ విజయభాస్కర్ రెడ్డి ఆదాలకు మద్ధతు ప్రకటించి తన ఆఫీసులోని కోటంరెడ్డి ఫ్లెక్సీలను తొలగించాడు.
దీంతో మళ్లీ వివాదం రాచుకుంది. తన ఫ్లెక్సీలను ఎందుకు తొలగించారంటూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయభాస్కర్ రెడ్డిపై బెదిరింపులకు పాల్పడ్డారు. కోటం రెడ్డి అనుచరులు తన ఇంటికొచ్చి భయపెట్టారని విజయభాస్కర్ రెడ్డి ఆరోపించారు. కోటంరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు.
ఇక ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ పెద్దలే తన ఫోన్ ట్యాపింగ్ చేశారని అన్నారు. దీంతో కోటంపై ఆగ్రహం వ్యక్తం చేసిన అధిష్టానం అతని స్థానంలో నెల్లూరు రూరల్ వైసీపీ అధ్యక్షుడిగా ఆధాల ప్రభాకర్ రెడ్డిని నియమించింది. రానున్న ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుంచి వైసీపీ తరుపున ఆదాలనే పోటీ చేస్తారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ఱారెడ్డి కూడా ప్రకటించారు.