Nara Lokesh: టీడీపీ నేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 26వ రోజుకు చేరుకుంది. ఎన్ని అడ్డంకులొచ్చినా యాత్రను కొనసాగిస్తున్నారు లోకేశ్. శుక్రవారం తిరుపతిలో పాదయాత్ర కొనసాగుతోంది. టీడీపీ కార్యకర్తలు, అభిమానులు పాదయాత్రలో పాల్గొని లోకేశ్ వెంట నడుస్తున్నారు. పాదయాత్రలో భాగంగా లోకేశ్ అన్ని వర్గాల వారితో సమావేశమవుతున్నారు. వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. అధికారంలోకి రాగానే సమస్యలను పరిష్కరించి, అండగా ఉంటామని హామీలు కుమ్మరిస్తున్నారు.
ఇక పాదయాత్రలో భాగంగా శుక్రవారం తిరుపతిలో ఆటో డ్రైవర్లతో లోకేశ్ సమావేశమయ్యారు. కాకీ చొక్కా ధరించి ఆటో నడిపారు. డ్రైవర్ల సమస్యలు తెలుసుకొని.. పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఆటో డ్రైవర్లకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
ఇక జనవరి 27న లోకేశ్ పాదయాత్రను ప్రారంభించారు. కుప్పం నియోజకవర్గం నుంచి పాదయాత్ర మొదలైంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు లోకేశ్ పాదయాత్రను కొనసాగించనున్నారు.