Nara Lokesh padayatra news(Political news in AP): యువగళం పాదయాత్రలో నారా లోకేష్కు ప్రమాదం తప్పింది. దర్శి నియోజకవర్గంలో జరిగిన పాదయాత్రలో జనం మీద పడటంతో లోకేష్ ఉక్కిరిబిక్కిరి అయ్యారు. తోపులాటలో మూడుసార్లు లోకేష్ కింద పడే ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. వ్యక్తిగత భద్రతా సిబ్బంది అప్రమత్తంతో లోకేష్కి ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది.
క్రౌడ్ మేనేజ్మెంట్లో తరచూ పోలీసులు విఫలమవుతున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. పోలీసులు కావాలనే.. లోకేష్కి పటిష్ట భద్రత కల్పించకుండా వదిలేస్తున్నారని విమర్శిస్తున్నారు. వైసీపీ పెద్దల ఒత్తిడి మేరకే లోకేష్ పాదయాత్రకి భద్రత తగ్గిందని చెబుతున్నారు. కందుకూరు, గుంటూరులో జరిగిన చంద్రబాబు సభల్లో మాదిరిగానే.. నారా లోకేష్ యువగళం పాదయాత్రలోనూ ఏదైనా దుర్ఘటన జరిగేలా వైసీపీ కుట్ర చేస్తోందని టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.