Nara Devaansh: మార్చి 21st. చంద్రబాబు మనువడు, లోకేశ్-బ్రాహ్మణిల తనయుడు నారా దేవాన్ష్ పుట్టిన రోజు. ఏటేటా ఘనంగా జరుపుకుంటారు నారా-నందమూరి కుటుంబం. అయితే, ఆడంబరాలకు వెళ్లకుండా.. సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వడం విశేషం.
చంద్రబాబు నాయుడికి తిరుమల వేంకటేశ్వర స్వామిపై అపార భక్తి. తిరుమల ఘాట్ రోడ్డులో ఆయనపై మావోయిస్టులు ల్యాండ్ మైన్స్తో దాడి చేయగా తృటిలో తప్పించుకున్నారు. శ్రీవారి ఆశీస్సుల వల్లే తాను ప్రాణాలతో బయటపడ్డానని చంద్రబాబు నమ్ముతారు. వీలైనప్పుడల్లా తిరుమల వెళ్లి వెంకన్న స్వామిని దర్శించుకుంటారు. ఇక, మనువడు దేవాన్ష్ పుట్టినరోజున శ్రీవారి సేవలో తరిస్తున్నారు.
ప్రతీ ఏడాది దేవాన్ష్ బర్త్డే సందర్భంగా టీటీడీ తరఫున భక్తులకు ఒకరోజు అన్నప్రసాద వితరణకు విరాళం ఇస్తూ వస్తున్నారు. ఇలా ఇవ్వడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. ఈసారి కూడా ఒకరోజు అన్నప్రసాద వితరణకు 33 లక్షల విరాళాన్ని లోకేశ్-బ్రాహ్మణి తరఫున కుటుంబసభ్యులు అందజేశారు.
మార్చి 21 శ్రీవారి అన్నప్రసాదానికి నారా దేవాన్ష్ పేరిట విరాళం ఇచ్చినట్టు తెలుపుతూ.. తిరుమల శ్రీవారి ఆలయ పరిసరాల్లోని డిస్ప్లే బోర్డుల్లో ప్రదర్శించారు. అది చూసి భక్తులు నారా దేవాన్ష్కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.