Nara Bhuvaneswari : టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సతీమణి భువనేశ్వరి చేపట్టిన ‘నిజం గెలవాలి’ యాత్ర శ్రీకాకుళం జిల్లాలో ముగిసింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టుతో మనస్తాపానికి గురై చనిపోయిన వారి కుటుంబాలను యాత్రలో భాగంగా ఆమె పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి రూ.3లక్షల చొప్పున ఆర్థిక సాయం చేసింది.
బాధిత కుటుంబాల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఎచ్చెర్ల, ఆముదాలవలస నియోజకవర్గాల పరిధిలోని నిమ్మతొర్ల తాండ పంచాయతీ, పాత నిమ్మతొర్లాడ, దనాన్నపేట, బుర్జా మండలంలోని తోటవాడ, జి.సిగడాం మండలంలోని దవలపేట గ్రామాల్లో నిజం గెలవాలి యాత్ర కొనసాగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్నాయుడుతో పాటు జిల్లాకు చెందిన పలువురు ముఖ్యనేతలు పాల్గొన్నారు.