EPAPER

Nara Bhuvaneswari : “నిజం గెలవాలి”.. ప్రజల్లోకి భువనేశ్వరి..

Nara Bhuvaneswari : “నిజం గెలవాలి”.. ప్రజల్లోకి భువనేశ్వరి..

Nara Bhuvaneswari : టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. చంద్రబాబు అరెస్ట్‌ వార్త తెలియగానే ఉద్వేగానికి గురై మరణించిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లబోతున్నారు. అక్టోబర్ 25 నుంచి “నిజం గెలవాలి” పేరుతో యాత్ర చేపట్టనున్నారు. చంద్రగిరిలో ఈ యాత్రను ప్రారంభించనున్నారు. భువనేశ్వరి వారానికి 3 రోజులు బాధిత టీడీపీ కార్యకర్తల కుటుంబాల ఇళ్లకు వెళ్లి పరామర్శిస్తారు. అలాగే ఆయాఆయా ప్రాంతాల్లో సభలు, సమావేశాల్లోనూ పాల్గొంటారు.


“నిజం గెలవాలి” యాత్రకు ముందుకు నారా భువనేశ్వరి తిరుమల వెళ్లారు. శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు దర్శన ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత అర్చకులు రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం పలికారు. తీర్థ ప్రసాదాలు అందించారు. భువనేశ్వరితోపాటు కొందరు టీడీపీ నేతలు స్వామివారిని దర్శించుకున్నారు. ఎమ్మెల్సీలు పంచుమర్తి అనురాధ, కంచర్ల శ్రీకాంత్‌, భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి శ్రీవారిని దర్శించుకున్నారు. భువనేశ్వరిని కలిసేందుకు వచ్చిన స్థానికులు, టీడీపీ కార్యకర్తలను పోలీసులు అనుమతించలేదు. వారిని ఆలయానికి దూరంగా పంపించారు. తిరుమల శ్రీవారి దర్శనం తర్వాత భువనేశ్వరి నారావారిపల్లెకు వెళ్లారు.


Tags

Related News

YCP vs Janasena: జనసేనలోకి చేరికలు.. కూటమిలో లుకలుకలు

YSRCP Petition: తిరుమల లడ్డూ వివాదం.. హైకోర్టులో వైసీపీ పిటిషన్, న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు

Ex MP Nandigam Suresh’s house: ఇదేం కేసు.. వైసీపీ మాజీ ఎంపీ ఇంట్లో సోదాలు, నోటీసులిచ్చిన పోలీసులు

Tirumala Prasadam row: తిరుమల లడ్డూ వివాదం, రామ్ జన్మభూమి ట్రస్ట్.. రమణ దీక్షితులు రియాక్ట్, శారదా పీఠం సైలెంట్ వెనుక..

Pawan Kalyan: తిరుమల లడ్డూ వివాదం.. డిప్యూటీ సీఎం పవన్ సంచలన పోస్ట్

Shani effect to Jagan: జగన్‌ను వెంటాడుతున్న శని, పుష్కర‌కాలంపాటు..

CM Chandrababu warning: తిరుపతి లడ్డూ వివాదం, నిన్ను వదలా అంటున్న సీఎం.. అయోధ్య వరకూ

Big Stories

×