Nara Bhuvaneshwari : టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి శుక్రవారం విశాఖ నగరంలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. ఉదయం 10 గంటలకు భువనేశ్వరి నోవాటెల్ హోటల్ నుంచి బయలుదేరారు. ప్రభుత్వం అకారణంగా చంద్రబాబునాయుడిని అరెస్టు చేసి జైలులో పెట్టడాన్ని తట్టుకోలేక మృతి చెందిన టీడీపీ కార్యకర్త కనకరాజు కుటుంబాన్ని ఆమె పరామర్శించారు.
కనకరాజు కుటుంబ సభ్యులకు రూ.3 లక్షల ఆర్థికసాయం అందించారు. పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యకర్తలు, నాయకులు, ప్రజలను పలకరించారు. నిజం గెలవాలి యాత్రలో భువనేశ్వరి వెంట ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత , కార్యకర్తలు పాల్గొన్నారు.