E-Paper
Advertisement

Nagababu: వాడో పెద్ద వెధవ.. వర్మపై నాగబాబు ఫైర్.. వైసీపీకీ కౌంటర్

Nagababu: వాడో పెద్ద వెధవ.. వర్మపై నాగబాబు ఫైర్.. వైసీపీకీ కౌంటర్
Advertisement

Nagababu: ఏపీలో అందరి టార్గెట్ పవన్ కల్యాణే. వైసీపీ నేతలకు రోజూ పవన్ ను తిట్టడమే పని. సీఎం జగన్ నుంచి మంత్రుల వరకూ.. అంతా జనసేనానిపై నోరు పారేసుకుంటారు. వారికి తోడుగా కొత్తగా రామ్ గోపాల్ వర్మ సైతం జతకలిశారు. వైసీపీ మీద సినిమా తీస్తున్నందుకో.. పవన్ మీద పాత పగలో.. కారణం ఏదైనా ఛాన్స్ దొరికినప్పుడల్లా మెగా ఫ్యామిలీని గిల్లుతుంటాడు ఆర్జీవి. దీంతో.. చిర్రెత్తుకొచ్చిన మెగా బ్రదర్ నాగబాబు వర్మకు, వైసీపీకి ఇద్దరికీ కలిసి ఇచ్చిపడేశారు.

ఇటీవల పవన్ కల్యాణ్.. చంద్రబాబును ఇంటికెళ్లి కలిశారు. కుప్పంలో బాబును అడ్డుకున్న ఉదంతంపై, జీవో నెంబర్ 1పై ఆ ఇద్దరూ కలిసి చర్చించారు. వారి భేటీపై వైసీపీ నేతలు వరుసబెట్టి మాటల దాడి చేస్తున్నారు. ప్యాకేజీ కోసమే పవన్.. చంద్రబాబును కలిశారంటూ ఎప్పటిలానే ఆరోపణలు చేశారు.

Advertisement

ఇక, ఆర్జీవీ అయితే తనదైన స్టైల్ లో కాంట్రవర్సీ క్రియేట్ చేశారు. ప్యాకేజ్ కోసం కాపులను తాకట్టు పెట్టావంటూ.. పవన్ ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. వర్మ ట్వీట్ పై కాపు సంఘాలు ఇప్పటికే మండిపడ్డాయి. ఇప్పుడిక పవన్ సోదరుడు నాగబాబు అటు వైసీపీపై, ఇటు వర్మపై ఫైర్ అయ్యారు.

పవన్ కు ప్యాకేజీ ఎవరు ఇచ్చారు? వైసీపీ నేతల తాతలు వచ్చి పవన్ కు ప్యాకేజీ ఇచ్చారా? అంటూ నాగబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒక్కో సినిమాకు రూ.కోట్లు తీసుకునే పవన్ కు ప్యాకేజీ అవసరమా? అని ప్రశ్నించారు. అటు.. రామ్ గోపాల్ వర్మ పెద్ద వెధవ అంటూ నాగబాబు మండిపడ్డారు. అవసరం కోసం వర్మ ఎంత నీచానికైనా దిగజారుతాడని చీదరించుకున్నారు. నాగబాబు కామెంట్లు ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి.

Related News

ఎట్టకేలకు ముహూర్తం ఖరారు.. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఓపెన్, ప్రధాని మోదీ చేతుల మీదుగా, కాకపోతే

ఏపీలో కరోనా కేసుల కలకలం.. కొత్త రకం వేరియంట్ గుర్తింపు, ఆగ్నేయాసియాలో ఎక్కువగా..

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

లారీని ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లో నలుగురు మృతి, విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం

ఆడవాళ్లకు రక్షణేది?.. గుంటూరు దారుణంపై మండిపడ్డ జగన్!

Fishermen Death: గోదావరిలో చేపల వేటకు వెళ్లి.. ఐదుగురు మృతి, ఏపీలో విషాదం

మహిళను రోడ్డుపై వివస్త్రను చేస్తారా! గుంటూరు ఘటనపై చంద్రబాబు సీరియస్

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా.. స్పాట్‌‌లో 60 మంది ప్రయాణికులు!

Big Stories

Advertisement
×