సామాజిక భద్రతా పెన్షన్ల విషయంలో రాష్ట్రప్రభుత్వం రూ.291 కోట్ల రూపాయలు దోచుకున్నారని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. రాష్ట్రప్రభుత్వం అంకెల గారడీతో ప్రజలను మోసం చేస్తుందన్నారు. కేవలం నెల రోజుల్లో 19 వేల మంది పింఛన్లను తొలగించారని మనోహర్ తెలిపారు.
ప్రభుత్వం 2023 నవంబర్ నెలలో రూ.2,750 చొప్పున 54,69,161 మందికి పింఛన్లు ఇచ్చామని చెప్పారు. డిసెంబర్ నెల వచ్చే సరికి 19,871 పింఛన్ల ను తొలగించారు. కేవలం ఒక నేల వ్యవధిలోనే పింఛన్లు పై కోత పెట్టి రూ.291కోట్ల రూపాయలను కాజేశారని నాదేండ్ల మనోహర్ ఆరోపించారు.
రాష్ట్రంలో వేల కోట్ల డబ్బుని దోచుకుని ఆ డబ్బుని ఎటు మళ్లిస్తున్నారో తెలియడం లేదన్నారు. నవంబర్ నెలలో రాష్ట్రవాప్తంగా 65.33 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చామని మంత్రి తెలిపారు. కానీ అర్హత ఉన్న వారికి కూడా పింఛన్లు అందకుండా నిలిపివేస్తున్నారు ఇది ఎక్కడి అరాచకమని మండ్డిపడ్డారు.