YCP MP Margani vs Adireddy: ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఏపీలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. రాజకీయ నేతలు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. రాజమండ్రిలో ఈ వ్యవహారం పీక్స్కు చేరింది. మొదట వాలంటీర్ ను బెదిరించాడంటూ టీడీపీ నేత ఆదిరెడ్డి అప్పారావు ఓ మహిళా వాలంటీర్ తో ఫోన్ లో మాట్లాడిన కాల్ రికార్డును “సిద్ధం” సభలో ప్రజల ముందు ప్లే చేసిన ఆదిరెడ్డి అప్పారావుకు.. చెప్పు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చారు వైసీపీ నేత ఎంపి మార్గాని భరత్.
దీంతో భరత్ వార్నింగ్ పై ఆదిరెడ్డి అప్పారావు స్పందిస్తూ భరత్ వి పిల్లకాకి చేష్టలని, అనుభవ రాహిత్యమని అన్నారు. వైఎస్ఆర్సిపికి ఓటు వెయ్యకపోతే పథకాలు తీసేస్తాం అని.. వాలంటీర్ ప్రజలను బెదిరించడంతో ఆ వాలంటీర్ తో ఫోన్ లో మాట్లాడి అలా అనవద్దని చెప్పడం జరిగిందని తెలిపారు. చెప్పులు తీసావంటే మా దగ్గర 40 వేల మంది కార్యకర్తలు ఉన్నారు.. ఒక్క సైగ చేశానంటే మీ చెప్పులు గిప్పులు ఎగిరిపోతాయని ఆదిరెడ్డి.. భరత్ కు సీరియస్ గా కౌంటర్ ఇచ్చారు.
Read More: వైసీపీకి మరో బిగ్షాక్.. మంత్రి గుమ్మనూరు జయరాం రాజీనామా.. టీడీపీలో చేరి అక్కడి నుంచి బరిలోకి..