MohanBabu: సీనియర్ నటుడు మోహన్ బాబు వివాదంలో చిక్కుకున్నారు. శ్రీ విద్యానికేతన్ సమీపంలోని 34 సెంట్ల స్థలంపై గొడవ జరుగుతోంది. మోహన్బాబుకు సంబంధించిన బౌన్సర్లు.. కత్తులు, పెట్రోల్ క్యాన్లతో వచ్చారని.. గొడవ చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం రంగంపేట గ్రామంలో ప్రభుత్వ భూములను మోహన్బాబు కాజేస్తుంటే.. తాము అడ్డుకుంటే చంపడానికి ప్రయత్నిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు మోహన్బాబు హత్యాయత్నానికి కూడా పాల్పడ్డారని ఆరోపించారు ఎంపీటీసీ, ఉపసర్పంచ్. రాత్రి నుంచి పెట్రోల్ బాటిల్స్, కత్తులు, కర్రలతో ఆరుగురు దుండగులు హల్చల్ చేశారని చెబుతున్నారు.
ఆరుగురు బౌన్సర్లు రాత్రి 11 గంటల సమయంలో రంగంపేటలోని ఎంపిటిసి బోసిరెడ్డి ఇంటి దగ్గరికి కర్రలతో పాటు పెట్రల్ బాటిల్స్తో వెళ్లారు. స్థానికులు వారిని పట్టుకోవడానికి ప్రయత్నించగా సతీష్ అనే యువకుడు దొరికాడు. అతన్ని పట్టుకుని చితకబాదారు. గ్రామంలో ఉన్న 34 సెంట్ల స్థలాన్ని గ్రామస్థులు డంప్ యార్డ్గా వాడుతున్నారు. దీన్ని మోహన్ బాబు స్వాదీనం చేసుకోవడానికి ప్రయత్నించగా స్థానిక నేతలు అడ్డుకున్నారు.