AP: ఎమ్మెల్సీ అనంత బాబు డ్రైవర్ హత్య కేసులో ఏపీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. కేసును సీబీఐకి అప్పగించాలని హతుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
కేసులో పోలీసులు లోతుగా దర్యాప్తు చేయలేదని పిటిషనర్ తరుపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. కేసును నీరు గార్చే విధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.
కేసులో ఎమ్మెల్సీ అనంత్ బాబు భార్యను ఎందుకు నిందితురాలిగా చేర్చలేదని హైకోర్టు ప్రశ్నించింది. ఇరువురు వాదనలు విన్న హైకోర్టు..తీర్పును రిజర్వ్ చేసింది.