MLA Rakshana Nidhi : వైసీపీకి మరో షాక్ తగిలింది. తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధి రాజీనామా చేశారు. విజయవాడ ఎంపి కేశినేని నాని వైసీపీలో చేరిన మరుసటి రోజే రక్షణనిధి రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. తిరువూరు టికెట్ తన అనుచరుడికి ఇవ్వాలంటూ జగన్ను కేశినేని నాని కోరినట్టు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో రక్షణనిధి వైసీపీకి రాజీనామా చేశారు.
MLA Rakshana Nidhi : వైసీపీకి మరో షాక్ తగిలింది. తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధి పార్టీకి రాజీనామా చేశారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని.. సీఎం జగన్ ను కలిసిన మరుసటి రోజే రక్షణనిధి రాజీనామా చేయడం హాట్ టాపిక్ గా మారింది. తిరువూరు టికెట్ తన అనుచరుడికి ఇవ్వాలని జగన్ను కేశినేని నాని కోరినట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రక్షణనిధి వైసీపీకి రాజీనామా చేశారు.
మరోవైపు వైసీపీ ఎమ్మెల్యేలు తాడేపల్లికి క్యూ కడుతున్నారు. గోదావరి జిల్లాలకు చెందిన నేతలు సీఎం జగన్ ను కలిసేందుకు వచ్చారు. రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగు బ్రిజేంద్ర రెడ్డి సీఎం క్యాంప్ ఆఫీస్కు వచ్చారు. వారితో మరికొందరు ఎమ్మెల్యేలు.. సీఎం జగన్ ను కలవనున్నారు.