వైసీపీ అధిష్ఠానం తీరుతో విసిగిపోయిన పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి టీడీపీలో చేరేందుకు సిద్దమవుతున్నారు. పార్థసారథితో విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ, మైలవరం టీడిపి నేత బొమ్మసాని సుబ్బారావు భేటీ అయ్యారు. పెనమలూరు సీటు సారథి కి ఇచేది లేదని వైసీపీ నాయకత్వం క్లారిటీ ఇచ్చింది. దీంతో పార్ధసారథి టీడీపీలోకి చేరుతున్నారని ప్రచారం నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.
కొలుసు పార్థసారథిని ఒప్పించేందుకు సీఎం జగన్ వద్దకు ఆయన్ను వైసీపీ దూతలు తీసుకెళ్లారు. జగన్ చెప్పినా.. పార్టీలో కొనసాగేందుకు సారథి పెద్దగా ఆసక్తి చూపించలేదు. మంగళవారం రాత్రి ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్కుమార్ కలిసి వచ్చి సారథిని విజయవాడలోని ఆయన పార్టీ కార్యాలయంలో కలిసి.. చాలా సేపు చర్చించారు. మళ్లీ అధికారంలోకి వస్తే పార్టీ అధిష్ఠానం నుంచి అన్ని రకాలుగానూ ప్రాధాన్యం ఇస్తుందనే సమాచారాన్ని సారథికి చెప్పి, నచ్చజెప్పాలని ప్రయత్నం చేశారు.