Kotamreddy: ఎమ్మెల్యే కోటంరెడ్డి, జగన్ సర్కార్ మధ్య వివాదం మరింత పెద్దదవుతోంది. అధిష్టానం యాక్షన్ డోసు పెంచినప్పటికీ కోటంరెడ్డి ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే పార్టీ ఇంచార్జి బాధ్యతల నుంచి తొలగించిన అధిష్టానం.. సెక్యూరిటీని కూడా తగ్గించింది. 2+2 గన్మెన్ల నుంచి 1+1కు కుదించింది.
దీనిపై కోటంరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 1+1 గన్మెన్లను కూడా ప్రభుత్వానికి సరెండర్ చేశారు. తనను ఒక్కడిని చేసి భయపెట్టాలని అనుకుంటున్నారని.. తనకు గన్మెన్లు అవసరం లేదని స్పష్టం చేశారు. ఇద్దరు గన్మెన్లను తొలగించినంత మాత్రాన తాను భయపడనని తెలిపారు.
ప్రస్తుతం ఉన్న ఇద్దరు గన్మెన్లు కూడా వద్దని… ప్రభుత్వానికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నానని వెల్లడించారు. ప్రజా సమస్యలపై ఎప్పుడూ గొంతెత్తుతూనే ఉంటానని.. ఇప్పుడు మరింత కసితో పనిచేస్తానని వివరించారు.