Dharmavaram news(Latest news in Andhra Pradesh): ధర్మవరం బంద్కు పిలుపునిచ్చారు వస్త్ర వ్యాపారులు. వారం రోజుల పాటు వస్త్ర దుకాణాలను బంద్ చేయాలని పిలుపునిచ్చారు. విజయవాడలో ధర్మవరం వస్త్ర వ్యాపారులపై దాడికి నిరసనగా ఈ బంద్కు నిర్ణయం తీసుకున్నారు. అలాగే ధర్మవరం వస్త్రవ్యాపారులపై దాడిని ఎమ్మెల్యే కేతిరెడ్డి తీవ్రంగా ఖండించారు. వస్త్ర వ్యాపారులను మీడియా ముందుకు తీసుకొచ్చారు ఆయన. ఇది వ్యక్తిపై జరిగిన దాడి కాదని.. వ్యవస్థపై జరిగిన దాడిగా అన్నారు ఎమ్మెల్యే కేతిరెడ్డి.
విజయవాడలో ఓ బట్టల షాపు యజమాని రెచ్చిపోయాడు. ధర్మవరానికి చెందిన ఇద్దరు బట్టల వ్యాపారులపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. రెండు వారాల కిందట జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వ్యాపారులను బట్టలు విప్పి కొడుతున్న వీడియో వైరల్ అయ్యింది.
ధర్మవరానికి చెందిన పట్టుచీరల వ్యాపారి..విజయవాడలోని ఓ వస్త్ర దుకాణానికి పట్టుచీరలు సప్లై చేస్తుంటాడు. అయితే సప్లై చేసిన చీరలకు డబ్బులు చెల్లించాలని షాపు యజమానిని అడగితే లేవంటూ దబాయించాడు. దీంతో ఆ వ్యాపారి..మరో వ్యాపారితో కలిసి డబ్బులు చెల్లించాలని షాపు యజమానిని డిమాండ్ చేశారు. దీంతో వారి మద్య జరిగిన వివాదంతో..వ్యాపారుల ఇద్దరిని షాపులో బందించి ఇరువురు పై షాపు యజమాని దాడికి పాల్పడ్డాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే మరోసారి దాడి చేస్తాం అంటూ బెదిరించడంతో ..వారి పోలీసులకు కూడా ఫిర్యాదు చేయనట్లు తెలుస్తుంది.