Gorantla Butchaiah : రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టాలని కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు తమను కోరుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి తెలిపారు. అభ్యర్థిని నిలబెడితే ఓటేసి గెలిపిస్తామని 50 మంది ఎమ్మెల్యేలు సంప్రదిస్తున్నారని చెప్పారు. అమరావతిలో పరిటాల రవి వర్ధంతి కార్యక్రమంలో మాట్లాడారు.
Gorantla Butchaiah : రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టాలని కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు తమను కోరుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి తెలిపారు. అభ్యర్థిని నిలబెడితే ఓటేసి గెలిపిస్తామని 50 మంది ఎమ్మెల్యేలు సంప్రదిస్తున్నారని చెప్పారు. అమరావతిలో పరిటాల రవి వర్ధంతి కార్యక్రమంలో మాట్లాడారు.
సీఎం జగన్కు ఓటమి భయం పట్టుకుందని బుచ్చయ్య చౌదరి అన్నారు. అందుకే గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఇప్పుడు ఆమోదింపజేశారన్నారు. రాష్ట్రం బాగుండాలనే చాలా మంది టీడీపీలో చేరుతున్నారన్నారు. అంబేడ్కర్ విగ్రహం పేరుతో దోపిడీ చేశారన్నారు. జగన్ పాలనలో సామాజిక న్యాయం ఎక్కడుందని ప్రశ్నించారు. కేసుల నుంచి తప్పించుకోవడం జగన్ కు అలవాటైపోయిందని విమర్శించారు.