EPAPER
Kirrak Couples Episode 1

Dorababu Pendem : పెండెం దొరబాబు బలప్రదర్శన.. పిఠాపురం సీటుపై జగన్‌ పునరాలోచిస్తారా..?

Dorababu Pendem : పెండెం దొరబాబు బలప్రదర్శన.. పిఠాపురం సీటుపై జగన్‌ పునరాలోచిస్తారా..?

Dorababu Pendem : ఇన్‌ఛార్జిల మార్పుతో వైసీపీలో పొలిటికల్ కాక రేగుతోంది. ఆ పార్టీలో ధిక్కార స్వరాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. కాకినాడ జిల్లా పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు శుక్రవారం ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. దాదాపు 50 వేల మంది ఈ వేడుకకు హాజరయ్యారు. దీంతో ఎమ్మెల్యే జన్మదిన వేడుక బలప్రదర్శనకు వేదికైంది.


పిఠాపురం సీటుపై సీఎం జగన్‌ పునరాలోచించాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. నియోజకవర్గంలో తనకే ఎక్కువ పట్టుందని.. దాదాపు 50వేల మంది హాజరై మద్దతు తెలిపారని అన్నారు. పిఠాపురం టికెట్‌ మళ్లీ తనకే ఇస్తే భారీ మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. తాను పార్టీ మారుతున్నట్టు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని చెప్పారు. సీఎం జగన్ ఆలోచించి తనకే సీటు ఇస్తారని ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యే దొరబాబు జన్మదిన వేడుకల కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో సీఎం జగన్‌ ఫొటో లేకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీతను.. పిఠాపురం పార్టీ ఇన్‌ఛార్జిగా అధిష్ఠానం నియమించింది. దీంతో సిట్టింగ్‌ ఎమ్మెల్యే పెండెం దొరబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయన జనసేనలోకి వెళ్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది.


Related News

Janasena Joinings: ఇట్స్ అఫీషియల్.. ఆ ఇద్దరి చేరికను కన్ఫర్మ్ చేసిన జనసేన

MP Vijayasai Reddy: విజయ సాయిరెడ్డి అక్రమ నిర్మాణాల కూల్చివేత.. చంద్రబాబుపై మండిపాటు

Tirumala Laddu Row: తిరుమల లడ్డూ వివాదం, విచారణ ఆపాలంటూ సుబ్బారెడ్డి పిటిషన్, సాయంత్రానికి రిపోర్ట్

Tirupati laddu: తిరుపతి లడ్డూ వివాదం.. అముల్ కంపెనీ ఏం చెప్పిందంటే..

MLC Botsa Comments: తిరుమల లడ్డూ కల్తీ వివాదం.. దేవుడితో రాజకీయాలొద్దన్న వైసీపీ ఎమ్మెల్సీ బొత్స

Jagan clarification: ఒప్పేసుకున్న జగన్.. మళ్లీ బెంగుళూరుకి, పోతే పోనీ అంటూ

MLA Adimulam case: ఎమ్మెల్యే ఆదిమూలం కేసు కొత్త మలుపు.. అసలేం జరుగుతోంది?

Big Stories

×