MLA Balakrishna : శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలకృష్ణ రెండు రోజులుగా పార్టీ కార్యకర్తలు, నాయకులతో పంచాయతీల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 22న చిలమత్తూరు మండలంలోని ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో రోజంతా సమీక్షలు జరిపారు.
రెండో రోజు లేపాక్షి మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో సమీక్షలు నిర్వహిస్తున్నారు. పార్టీలో కిందిస్థాయి కార్యకర్తలకు నాయకులు సరైన ప్రాధాన్యత ఇస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో విజయం కోసం ఎటువంటి వ్యూహాలు అమలు చేయాలో కార్యకర్తలతోనే బాలకృష్ణ నేరుగా అడిగి తెలుసుకుంటున్నారు. గత తొమ్మిదిన్నర ఏళ్లుగా ఎన్నడూ లేనివిధంగా కార్యకర్తలతో నేరుగా మాట్లాడడం ఇదే మొదటిసారి అంటూ కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.