Minister PeddiReddy | తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇటీవల ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్తో భేటీ అయ్యారు. ఈ విషయమై అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు.
Minister PeddiReddy | తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇటీవల ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్తో భేటీ అయ్యారు. ఈ విషయమై అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు.
మంగళవారం ఆయన మీడియతో మాట్లాడుతూ.. “చంద్రబాబు నాయుడుకు ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకుంది. అందుకే ప్రశాంత్ కిషోర్ని పిలిపించారు. గతంలో మేము ప్రశాంత్ కిషోర్ను వాడుకొని వదిలేశాం. అలా వాడుకొని వదిలేసిన ప్రశాంత్ కిషోర్ను చంద్రబాబు తీసుకున్నాడు. టిడిపి కోసం ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్లు వచ్చినా ఏ ఒక్కరు కూడా చంద్రబాబును నమ్మే పరిస్థితి లేదు. టిడిపి పరిస్థితి ఏపీలో దారుణంగా ఉంది. ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్లు వచ్చి ఏమీ చేయలేరు. ఎన్నికల భయంతోనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపైన చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారానికి ఎల్లో మీడియా అండగా ఉంది. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా.. ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్లు ఎంత మంది వచ్చినా వైసీపీ విజయాన్ని ఆపలేరు. ఈ సారి ఎన్నికల్లో గత ఎన్నికల కంటే ఎక్కువ స్థానాలు వైసీపీ గెలుస్తుంది,” అని ధీమా వ్యక్తం చేశారు.
Minister PeddiReddy Ramachandra Reddy, mock, Chandrababu Naidu, meeting, Prashant Kishor, TDP, Election Strategist, Andhra Pradesh news,