Minister Dharmana Hot Comments on on Volunteers: తాజాగా మంత్రి ధర్మాన ప్రసాదరావు కీలక వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లు అందరూ రాజీనామా చేశారని, వారంతా పార్టీ నేతలు, కార్యకర్తలేనన్నారు. మంత్రి వ్యాఖ్యలతో వాలంటీర్ల లోగుట్టు బయటపడింది. శ్రీకాకుళం జిల్లా గార మండలం లింగాలవలస గ్రామానికి మంత్రి ధర్మాన ప్రసాదరావు వచ్చారు. రాజీనామా చేసిన వాలంటీర్లతో సభ జరిగింది. దీనికి మంత్రి ధర్మాన హాజరై ఈ వ్యాఖ్యలు చేశారు.
వాలంటీర్లకు సమయం అయిపోయిందని, వారిని రెచ్చగొట్టి మరీ వైసీసీ రాజీనామాలు చేయిస్తోందని ఆరోపించారు టీడీపీ నేతలు. అంతేకాదు మరో అడుగు ముందుకేసిన టీడీపీ అధినేత చంద్రబాబు, తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాలంటీర్ల వ్యవస్థను తొలగించదని క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు జూన్ నుంచి నెలకు పది వేల రూపాయలు ఇస్తున్నట్లు ఉగాది రోజున ప్రకటించారు. దీంతో వాలంటీర్లు ఆలోచనలో పడ్డారు.
మొత్తం వాలంటీర్ల వ్యవస్థలో ఒకవంతు కూడా రాజీనామా చేయలేదన్నది అసలు విషయం. ఇదే క్రమంలో రాజీనామా చేసిన వాలంటీర్లను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు మంత్రి ధర్మాన. వారంతా రాజీనామా చేశారని, మీరంతా తమ పార్టీ నేతలే అంటూ వాళ్లని మభ్యపెట్టడం మొదలుపెట్టారు. మొత్తానికి ఏపీలో రాజకీయాలు వాలంటీర్ల చుట్టూ తిరుగుతోంది.
Also Read: CM Jagan plan: పండితుల వద్దకు అభ్యర్థులు, చెల్లెళ్లకు ధీటుగా రంగంలోకి ఆమె..!
వైసీపీకి ఓట్లు పడేలా పనిచేయాలి
రాజీనామా చేసిన వలంటీర్లకు మంత్రి ధర్మాన సూచనవలంటీర్లతో ప్రణాళిక ప్రకారమే వైసీపీ ప్రభుత్వం రాజీనామాలు చేయిస్తుందని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు మంత్రి ధర్మాన చేసిన వ్యాఖ్యలు అర్ధం పడుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా గార మండలం లింగాలవలస గ్రామంలో… pic.twitter.com/DaoMdtf194
— BIG TV Breaking News (@bigtvtelugu) April 11, 2024