EPAPER

Minister Anitha: జగన్ సినిమాలో పస లేదు: మంత్రి అనిత

Minister Anitha: జగన్ సినిమాలో పస లేదు: మంత్రి అనిత

Minister Anitha: వైసీపీ అధినేత జగన్ బుధవారం ఢిల్లీలో చేసిన ధర్నాపై ఏపీ హోం మంత్రి అనిత సెటైర్లు వేసారు. అధి ధర్నా కాదు డ్రామా అంటూ వ్యాఖ్యానించారు. కూటమి అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లోనే 36 మంది వైసీపీ కార్యకర్తలు రాజకీయ హత్యల కారణంగా చనిపోయారని చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఒక వేళ 36 మంది రాజకీయ హత్యలతో నిజంగానే చనిపోతే జగన్ ఒక్కరిని మాత్రమే ఎందుకు పరామర్శించారని అన్నారు. 36 మంది వివరాల జాబితాను ఇవ్వాలని సూచించారు.


రాజకీయ కక్షల వల్ల నలుగురు చనిపోయారని అందులో ముగ్గురు టీడీపీకి చెందిన వారే అని అన్నారు. ఢిల్లీలో ధర్నా చేస్తున్న జగన్‌కు ఎన్డీయే నాయకులు ఎవరూ మద్దతు ఇవ్వలేదని , కేవలం జగన్ పాలనలో జరిగిన విధ్వంసాన్ని తెలియని వారే మద్దతిచ్చాని అన్నారు. ధర్నాను చూస్తుంటే కేవలం సినిమా సెట్టింగ్ మాదిరిగానే ఉందని, కానీ జగన్ సినిమాలో మాత్రం అస్సలు పస లేదని ఎద్దేవా చేశారు.

ఏ రాజకీయ పార్టీ అయినా సిద్ధాంతంతో నడుస్తుంది. కానీ ఏపీలో ఫేక్ రాజకీయం. ఫేక్ ప్రచారం మాత్రమే కొనసాగుతోంది. ఇంకా అధికారంలో ఉన్నామనే భ్రమలో ఉంటూ అబద్ధపు ప్రచారాల వైసీపీ నేతలు చేస్తున్నారు. వై నాట్ 175 కి 11 సీట్లు కూడా తెచ్చుకోలేదు. అసెంబ్లీ సమావేశాలు ఎగ్గొట్టాలనే ఉద్దేశంతో ధర్నాలు చేస్తున్నారు. గతంలో ప్రతిపక్షాలపై నోటికొచ్చినట్టు మాట్లాడారు. ఢిల్లీలో తుగ్లక్ రెడ్డి ధర్నా చేయడం సిగ్గుచేటుగా ఉంది. జగన్‌కు భయం పట్టుకుంది. ఢిల్లీ వెళ్లి అక్కడ కూడా రెడ్ బుక్ గురించి మాట్లాడుతూనే ఉన్నారు.


Also Read:‘రాజకీయ నేతలు తప్పు చేస్తే శిక్షలు ఉండవా..?’

ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్ష సభ్యుడిగా హుందాగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. బడ్జెట్‌లో రూ. 15 వేల కోట్లు ఏపీకి ఇచ్చినందుకు ఢిల్లీ వెళ్లిన జగన్ ప్రధాని మోడీకి ధన్యవాదాలు చెప్పాల్సి వుంది. జగన్ ఢిల్లీలో ఫోటో ఎగ్జిబిషన్ పెట్టారు. గతంలో అనంతబాబు హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే అసెంబ్లీలో సేవ్ డెమోక్రసీ అనే ప్లకార్డులు పెట్టుకోవడం సిగ్గుచేటుగా ఉంది. అమరావతిలో మహిళా రైతులు ధర్నా చేస్తే ఆ ఫోటోలు పెట్టలేదు. గత ఐదేళ్లలో వైసీపీ చేసిన ఘటనలు ఎగ్జిబిషన్ పెడితే ఢిల్లీ సగం కూడా సరిపోదు. టీడీపీ హయంలో జరిగిన అన్ని హత్యలకు కూటమి కారణం అని అంటున్నారని మంత్రి అన్నారు.

Related News

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Big Stories

×