Tirupati news today live(Breaking news in Andhra Pradesh): తిరుపతి గోవిందరాజస్వామి ఆలయం సమీపంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. లావణ్య ఫొటో ఫ్రేమ్ వర్క్స్ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రాంతం నిత్యం రద్దీగా ఉంటుంది. మంటలు ఇళ్ల వైపు వ్యాపించడంతో స్థానికులు భయాందోళన చెందారు. గోవిందరాజస్వామి ఆలయ రథం వైపు మంటలు వ్యాపించాయి. దీంతో అగ్నిమాపక సిబ్బంది ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.
5 అంతస్తుల భవనంలోని ఓ ఫ్లోర్లో ఫొటో ఫ్రేమ్ వర్క్స్ షాపు ఉంది. షార్ట్ సర్య్కూట్ వల్ల ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. అందులో ఫొటోలు దగ్ధమయ్యాయి. వాటి విలువ కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రమాద సమాచారం తెలియగానే 3 అగ్నిమాపక వాహనాల్లో సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.
ప్రమాదం జరిగిన భవనం ముందు ఉన్న 5 బైకులు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటలు చెలరేగిన వెంటనే ఫొటో ఫ్రేమ్ వర్క్స్ దుకాణంలో పనిచేస్తున్న సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. బయటకు పరుగులు తీశారు. భవనంలో ముగ్గురు వ్యక్తులు చిక్కుకున్నారని స్థానికులు అంటున్నారు.