Visakhapatnam News(Latest Telugu News in AP) : లోన్యాప్ నిర్వాహకుల వేధింపులకు మరో యువకుడు బలి అయ్యాడు. అప్పు చెల్లించకపోతే ఫోటోలు మార్ఫింగ్ చేసి నెట్లో పెడతామని బెదిరించడంతో.. యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. విశాఖ జిల్లా కంచరపాలెం కప్పరాడ గ్రామంలో ఈ ఘటన జరిగింది.
ఓ ప్రయివేట్ సంస్థలో పనిచేస్తున్న హేమంత్.. అవసరాల నిమిత్తం గతంలో లోన్యాప్ ద్వారా అమౌంట్ తీసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందుల వల్ల సక్రమంగా చెల్లించలేకపోవడంతో.. లోన్యాప్ నిర్వాహకులు బెదిరింపులకు దిగారు. దీంతో బిర్లాకూడలి ఏరియాలో ఉరివేసుకొని ఆత్మహత్య హేమంత్ ఆత్మహత్య చేసుకున్నాడు.
కుమారుడి స్నేహితుల ద్వారా విషయం తెలుసుకొన్న కుటుంబ సభ్యలు.. కంచరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.