Malladi Vishnu latest news(AP politics):
వైఎస్ షర్మిల కాంగ్రెస్లో చేరడంతో ఏపీలో పొలిటికల్ ఈక్వేషన్స్ మారుతున్నాయి. ఆమె వెంట నడిచేందుకు చాలా మంది నేతలు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్లో చేరతానని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. అదే బాటలో చాలా మంది నేతలు ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆ నేతలంతా వైసీపీ నుంచే వస్తారనే టాక్ నడుస్తోంది. వైసీపీ టిక్కెట్ దక్కని నేతలు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.
వైసీపీ అధినాయకత్వంపై విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అసంతృప్తిగా ఉన్నారు. దీంతో ఆయన వైసీపీని వీడతారంటూ ప్రచారం జరుగుతోంది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఇంచార్జ్ బాధ్యతల నుంచి మల్లాదిని వైసీపీ తప్పించింది. ఆ బాధ్యతలు విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కు ఇచ్చింది. దీంతో మల్లాది అసంతృప్తిగా ఉన్నారు. ఇప్పటికే ఆయన తన అనుచరులతో చర్చలు జరుపుతున్నారు. వైఎస్ షర్మిలతో మల్లాది టచ్ లోకి వెళ్లారని అనుచరులు చెబుతున్నారు.