Machilipatnam : మచిలీపట్నంలో మైనార్టీ గురుకుల పాఠశాలలో ప్రిన్సిపల్ రాసలీలలు బయటపడ్డాయి. తొటి కాంట్రాక్ట్ యూడీసీ ఉద్యోగినితో ప్రిన్సిపల్..హాస్టల్లో రాసలీలలు కొనసాగిస్తున్నాడు. దీనికి సంబంధించి విద్యార్ధులు వీడియో తీసారు. గురుకుల పాఠశాలలో ప్రిన్సిపల్ ఆనంద్ ప్రసాద్..కాంట్రాక్ట్ ఉద్యోగిని అక్రమ సంబంధం కొన్ని నెలలుగా సాగుతోందని పాఠశాల సిబ్బంది చెబుతున్నారు.
అయితే తామిద్దరి మధ్య ఎలాంటి అక్రమ సంబంధం లేదని ప్రిన్సిపల్, ఉద్యోగిని బుకాయించారు. తరువాత విద్యార్ధులు వీడియోలు బయటపెట్టడంతో తాము చేసిన పనికి తలదించుకున్నారు. పాఠశాలలో విద్యార్ధులకు పాఠాలు చెప్పాల్సిన గురువులే ఈ రాసలీలలకు పాల్పడడమేమిటని విద్యార్ధుల తల్లితండ్రులు మండిపడుతున్నారు.