Ex MLA Pinnelli: దాదాపు రెండు నెలల తర్వాత మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైలు నుంచి విడుదలయ్యారు. నెల్లూరు జైలు నుంచి బయటకు వస్తున్న సమయంలో పిన్నెల్లి కొడుకు కంటతడి పెట్టాడు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈవీఎం డ్యామేజ్ వ్యవహారంపై పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కేసులు నమోదు అయ్యాయి. అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. చివరకు న్యాయస్థానం జోక్యంతో పోలీసులకు లొంగిపోయారు. దీంతో పిన్నెల్లిని నెల్లూరు సెంట్రల్ జైలుకి తరలించారు.
బెయిల్పై బయటకు వచ్చేందుకు పలుమార్లు ప్రయత్నాలు చేశారాయన. శుక్రవారం న్యాయస్థానం పలు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అనంతరం ప్రత్యేక వాహనంలో ఆయన బయలుదేరారు. పాస్పోర్టును పోలీస్స్టేషన్లో స్వాధీనం చేయనున్నారు. నెల్లూరు నుంచి నేరుగా నరసరావుపేటకు వెళ్లనున్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.
ALSO READ: కౌలాలంపూర్లో కుప్పం మహిళ గల్లంతు, నడుస్తుండగా..
రెండురోజులు నరసారావుపేటలో విశ్రాంతి తీసుకున్న తర్వాత మాచర్లకు వెళ్లనున్నారు పిన్నెల్లి. నరసారావుపేట, మాచర్లలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్త తీసుకున్నారు పోలీసు అధికారులు. ఎన్నికల ఫలితాల తర్వాత సొంతూరు వస్తుండడంతో ఏం జరుగుతుందోనని చర్చించుకుంటున్నారు.
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇన్నాళ్లు మాదిరిగా దూకుడుగా వ్యవహరించలేరన్నది వైసీపీ నేతల మాట. గతంలో ఉన్న అధికారులను వేరే ప్రాంతానికి ట్రాన్స్ఫర్స్ చేశారు. 20 ఏళ్ల తర్వాత టీడీపీ గెలిచింది. ప్రస్తుతం టీడీపీ అధికారంలో ఉందని, ఈ లెక్కన పిన్నెల్లి సైలెంట్గా ఉంటారని చెబుతున్నారు. పిన్నెల్లి జైలుకి వెళ్లిన తర్వాత ఎలాంటి ఘటనలు మాచర్లలో జరగలేదని అంటున్నారు.
నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి విడుదలైన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.#Macherla #Ysrcp #PinnelliRamakrishnaReddy #Nellore #NewsUpdates #Bigtv @YSRCParty @ysjagan https://t.co/ps2w8ZDvUj pic.twitter.com/Ap5mMfXCh0
— BIG TV Breaking News (@bigtvtelugu) August 24, 2024