Eluru : ఓ ముగ్గురు స్నేహితులు కలిసి డిసెంబర్ 31 అర్ధరాత్రి వరకు కొత్త సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. కానీ వారికి అదే చివరి రోజు అయ్యింది. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలంలో ఈ విషాదర ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కనసానపల్లికి చెందిన ముగ్గురు యువకులు మామిడి తోటలో కొత్త సంవత్సరం వేడుకలు నిర్వహించుకున్నారు.
వేడుకలు ముగించుకుని బైక్ పై ఇంటికి వెళ్తుండగా అదుపుతప్పి తోటలో ఉన్న బావిలో పడ్డారు. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. మరో యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థాలన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.