నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వెంకటగిరి – రాపూరు క్రాస్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. ఆగివున్న లారీని వెనక నుంచి మరో లారీ ఢీ కొట్టింది. దాంతో వెనుక ఉన్న లారీ డ్రైవర్ అక్కడికక్కడే మరణించాడు.
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్యాబిన్ లో ఇరుక్కున్న డ్రైవర్ మృతదేహాన్ని జేసీబీ సాయంతో బయటికి తీసి.. పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పొగమంచు కారణంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.