Amaravati : కర్నూలుకు చెందిన పలువురు వైసీపీ నేతలు టీడీపీలో చేరారు. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వారికి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కర్నూలు 17వ డివిజన్ కార్పొరేటర్ కైపా పద్మాలతా రెడ్డి, కేవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కాలేజీ అధినేత సుబ్బారెడ్డి, కైపా అశోక్ కుమార్రెడ్డి , పలువురు నేతలు వైసీపీలో రాజీనామా చేసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.
జిల్లాలో పార్టీ గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని లోకేశ్ వారిని సూచించారు. టీడీపీతోనే కర్నూలు జిల్లా అభివృద్ధి సాధ్యమని నేతలు అన్నారు. వైసీపీ ప్రభుత్వ వేధింపులతో జిల్లాకు వచ్చిన పరిశ్రమలు వెనక్కి వెళ్లిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాంభూపాల్రెడ్డి, కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.