Kurnool Nandyala : కర్నూలు జిల్లా నంద్యాలలోని ఓ హోటల్ లో కలకలం రేగింది. తినే ఆహార పదార్ధంలో బల్లి కన్పించింది. దీంతో కస్టమర్లు కంగుతిన్నారు. వివాహ నిమిత్తం నంద్యాలకు 20 మంది కాకినాడ వాసులు. ఉడిపి హోటల్ కు వెళ్లారు. తినేందుకు ఇడ్లీ సాంబారు ఆర్డర్ చేశారు. ఇంత వరకు బాగానే ఉంది.
తినే సమయంలో కస్టమర్లకు ఊహించని షాక్ తగిలింది. ఆ పదార్ధంలో బల్లి కన్పించింది. షాక్ కు గురైన కస్టమర్లు…హోటల్ యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు. ఇష్టానుసారం వండి మనుషుల ప్రాణాలతో ఆటలాడతారా అని ప్రశ్నించారు. ఈ క్రమంలో హోటల్ యాజమాన్యానికి …వినియోగదారులకు మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది.