Sanjeev Kumar : వైసీపీకి మరో షాక్ తగిలింది. ఇన్ ఛార్జుల మార్పు ఆ పార్టీలో అలజడి రేపుతోంది. ఇప్పటికే చాలా మంది నేతలు తమ టిక్కెట్ దక్కదని తేలడంతో పార్టీని వీడుతున్నారు. తాజాగా కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ కూడా వైసీపీకి షాక్ ఇచ్చారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎంపీ పదవికి రాజీనామా చేశారు. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ పదవి నుంచి తప్పించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
‘కర్నూలులో వలసలు, ఆత్మహత్యలు ఆగాలనేది నా లక్ష్యం. కర్నూలు నుంచి బళ్లారి వరకు జాతీయ రహదారి సాధించాలి. నా పరిధిలో ఉన్నంత వరకు నేను చేశా. ఏ పార్టీలో చేరాలనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదు. నా సన్నిహితులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటా’ అని సంజీవ్కుమార్ వెల్లడించారు.