Malaysia: మలేషియా రాజధాని కౌలాలంపూర్లో దారుణం జరిగింది. ఫుట్పాత్పై ఫ్యామిలీ సభ్యులతో కలిసి నడుస్తుండగా ఒక్కసారిగా కుంగిపోయింది. ఈ ఘటనలో ఏపీలోని కుప్పం ప్రాంతానికి చెందిన మహిళ అందులోపడిపోయింది. ఆమె ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు అధికారులు.
కుప్పంలోని అనిమిగానిపల్లెకు చెందిన 45 ఏళ్ల విజయలక్ష్మి ఫ్యామిలీ మలేషియాలో ఉంటుంది. చిన్నిచిన్న వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తోంది. అయితే శుక్రవారం ఉదయం విజయలక్ష్మి తన భర్త, కొడుకుతో కలిసి కౌలాలంపూర్లో పుట్పాత్పై నడుస్తోంది. కుటుంబ సభ్యులతో కష్టాలు చెబుతూ అడుగులు వేస్తోంది.
వారు వెళ్తున్న మార్గంలో పుట్పాత్ లోని కొంత భాగం కుంగిపోయింది. ఆమె డ్రైనేజీలో పడిపోయింది. ఆమె భర్త, కొడుకు ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. సమాచారం అందుకున్న స్థానికులు అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతానికి మహిళ ఆచూకీ లభించలేదు.
ALSO READ: తాజాగా కీలక వ్యాఖ్యలు చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఎమ్మెల్సీ శ్రీకాంత్ బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ విషయాన్ని ఎమ్మెల్సీ.. సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే సీఎం చంద్రబాబు మలేషియా అధికారులతో మాట్లాడారు. విజయలక్ష్మి ఆచూకీ తెలపాలని సూచన చేశారు. ప్రస్తుతం అక్కడ గాలింపు చర్యలు జరుగుతున్నాయి.
మలేసియా: కౌలాలంపూర్లో కుప్పం మహిళ గల్లంతు
పుట్పాత్ కుంగి మురుగుకాల్వలో కొట్టుకుపోయిన విజయలక్ష్మి(45).
విజయలక్ష్మిది చిత్తూరు జిల్లా కుప్పం మండలం అనిమిగానిపల్లె.
గాలింపు చర్యలు పకడ్బంధీగా జరిగేలా చూడాలని ఏపీఎన్ఆర్టీ అధికారులను ఆదేశించిన సీఎం చంద్రబాబు.#CCTVFootage… pic.twitter.com/n1i8FHRhhV
— BIG TV Breaking News (@bigtvtelugu) August 24, 2024