సీఎం జగన్ కోడికత్తి కేసులో శ్రీను తరపున వాదిస్తున్న లాయర్ సలీం మిస్సింగ్ అయ్యాడు. నిన్న రాత్రి నుంచి కనిపించడం లేదని.. ఆయన భార్య, కుమారుడు చెబుతున్నారు. ఆయన అదృశ్యం గురించి మిత్రుడైన అడ్వకేట్ శ్రీనివాస్ ను కలిసి చెప్పారు. నిన్న రాత్రి నుంచే ఫోన్ కూడా స్విచ్ఛాప్ వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కోడికత్తి శ్రీను కేసు వాదిస్తున్నప్పటి నుంచి.. బెదిరింపులు వస్తున్నాయి.. పోలీసులే తన భర్తను.. కిడ్నాప్ చేసి ఉంటారని సలీం భార్య అనుమానం వ్యక్తం చేస్తోంది.
ఏపీ సీఎం జగన్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో కోడి కత్తితో దాడి చేసిన శ్రీను తల్లి సావిత్రి నిరసనకు దిగింది. గుంటూరులో దళిత సంఘాలతో కలిసి ఆమె ఆందోళన చేపట్టారు. జగన్ తన కుమారుడి జీవితం నాశనం చేశాడని కంటతడిపెట్టారు. ఆయన కోర్టు విచారణకు రాకపోవడం వల్ల శ్రీను ఐదేళ్లుగా జైలులోనే మగ్గుతున్నాడని వాపోయింది. ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని వేడుకుంది.
మరోవైపు శ్రీను కూడా విశాఖ జైల్లో నిరాహార దీక్షకు దిగాడు.జగన్పై కోడికత్తితో దాడికి దిగిన శ్రీనివాస్ గత ఐదేళ్లుగా రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. అయితే జగన్ కోర్టులో వాంగ్మూలం ఇస్తే శ్రీనుకు బెయిల్ వచ్చే అవకాశాలున్నాయి. కానీ ఆయన కోర్టుకు హాజరుకావడం లేదు. దీంతో విశాఖ సెంట్రల్ జైల్లో శ్రీను నిరాహార దీక్షకు దిగాడు.
ఈలోగా శ్రీను తరపున వాదిస్తున్న లాయర్ సలీం మిస్సింగ్ కావడం కలకలం రేపుతోంది