Kodi Kathi Case Dalit Communities Comments on Jagan: కోడి కత్తి కేసు విచారణకు నిందితుడు శ్రీనివాస్ కోర్టుకు హాజరయ్యాడు.ఈ మేరకు ఆయన వెంట లాయర్ సలీంతోపాటు దళిత సంఘాల నాయకుడు బూసి వెంకట్రావులు విశాఖపట్నంలోని ఎన్ఐఏ కోర్టుకు వచ్చారు. మంత్రిగా ఉన్న నారా లోకేశ్ పరువు నష్టం కేసులో కోర్టుకు హాజరయ్యారని.. సాధారణ ఎమ్మెల్యేగా ఉన్న జగన్ ఎందుకు రావడం లేదని లాయర్ సలీం ప్రశ్నించారు.
జగన్.. కోడి కత్తి కేసుకు సంబంధించి వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఈ కేసు ఎప్పుడు కొలిక్కి వస్తుందనే విషయం ఎవరికీ తెలియదు. అయితే ప్రస్తుతం కోడి కత్తి కేసులో నిందితుడు జనుంపల్లి శ్రీనివాస్ కోర్టుకు హాజరయ్యారు. ఆ కత్తి జనుంపల్లి శ్రీనివాస్ వాడిన కత్తి కాదని, విజయనగరం కత్తి అని, చల్లా శ్రీను వాడారని లాయర్ వెల్లడించారు.
అయితే, గతంలో జగన్ సీఎంగా ఉన్న సమయంలో బిజీగా ఉన్నానని, పాలన బాధ్యతలు ఇబ్బందిగా ఉన్నాయని, కోర్టుకు హాజరు కాలేనని చెప్పారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఆయన కోర్టుకు వచ్చి వాంగూల్మం ఎందుకు ఇవ్వడం లేదని లాయర్ ప్రశ్నిస్తున్నారు.
ఈ మేరకు వైసీపీ అధినేత వైఎస్ జగన్పై ఫైర్ అయ్యారు. జైలులో ఉన్న సమయంలో కలిసేందుకు వెళ్లినప్పు అభ్యంతరం కోర్టులో లాయర్ ఎదుట హాజరై వాంగ్మూలం ఇవ్వడానికి జగన్ కు అభ్యంతరం ఏంటోనని అన్నారు. కావాలనే ఈ కేసు కొనసాగించాలని చూస్తున్నారని మండిపడ్డారు.
Also Read: సజ్జల జస్ట్ శాంపిల్, నెక్ట్స్ ఎవరు.. వైసీపీని వణికిస్తున్న బాబు మాస్టర్ ప్లాన్
ఒకవేళ జగన్ రాని సమక్షంలో ఆయనను సీఆర్పీసీ 37 ప్రకారం అరెస్ట్ చేయాలన్నారు. ఆ తర్వాత ఆయన నుంచి వాంగ్మూలం రికార్డు చేయాలని చెప్పారు.ఆ ఇప్పటికైనా జగన్ స్పందించి కోడికత్తి కేసులో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.